Advertisement

  • ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని ఆత్మహత్య చేసుకున్న యువకుడు...

ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని ఆత్మహత్య చేసుకున్న యువకుడు...

By: Sankar Sun, 01 Nov 2020 3:22 PM

ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని ఆత్మహత్య చేసుకున్న యువకుడు...


ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో జరిగింది. తన ఆత్మహత్యకు ప్రభుత్వ ఉద్యోగమే కారణమంటూ సూసైడ్ నోట్ రాసిమరీ తనువు చాలించాడు ఆ యువకుడు. పూర్తి విరాల్లోకి వెళ్తే.. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌కు చెందిన 32 ఏళ్ల నవీన్ అనే వ్యక్తి.. ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డారు.. మొత్తానికి ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో ఉద్యోగాన్ని సంపాదించాడు.

అయితే, ఉద్యోగ ప్రయత్నంలో చాలా కష్టపడాల్సి వచ్చింది.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో భగవంతుడిపై భారం వేశాడట.. తనకు ఉద్యోగం ప్రసాదిస్తే మొక్కు చెల్లించుకుంటున్నానని కోరుకున్నాడట.. ఆ మొక్కు ప్రకారమే ఇప్పుడు తన ప్రాణాలను వదులుకున్నాడని తెలుస్తోంది.. ఎందకంటే.. ప్రభుత్వ ఉద్యోగం కోసం విచిత్రమైన మొక్కుచెల్లించాడు నవీన్.. ప్రభుత్వ రంగ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే ముంబై నుండి త్రివేండ్రంకు రైలులో బయల్దేరాదు.. మార్గమధ్యలో ఓ రైల్వే స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా... ఓ సూసైడ్ నోట్ లభించింది...

అందులో 'ప్రభుత్వ ఉద్యోగం వస్తే తనకు తానుగా బలి అవుతానని దేవున్ని మొక్కుకున్నానని... అందుకోసమే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నా..' అని రాసుకొచ్చాడు. అయితే, ఈ ఘటనపై అనుమానాలను వ్యక్తం చేస్తున్న పోలీసులు.. ఎవరైనా హత్య చేసి ఇలా నోట్ పెట్టి ఉంటారా? అనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Tags :

Advertisement