Advertisement

తల్లిదండ్రుల మీద అలిగి ఆత్మహత్య ఓ కూతురు..!

By: Anji Thu, 17 Dec 2020 1:25 PM

తల్లిదండ్రుల మీద అలిగి ఆత్మహత్య ఓ కూతురు..!

ఈ కాలం యువత చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటోంది. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తున్నాయి.

కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నాయి. తాజాగా తల్లిదండ్రులమీద అలిగిన ఓ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది.

తనను ఎంగేజ్‌మెంట్‌కు తీసుకెళ్లలేదని మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

ఎస్‌ఐ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీలో ఉద్యోగి అయిన ముత్యంరెడ్డి మేడ్చల్‌ కేఎల్లార్‌ నగర్‌లో కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.

ముత్యంరెడ్డి కుమార్తె రంగన్నగారి రవళిరెడ్డి(24) కేరళలోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్‌ చేస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ కావడంతో గతకొద్ది నెలలుగా ఆమె ఇంటినుంచే పనిచేస్తోంది.

ఈ క్రమంలో బుధవారం గజ్వేల్‌లో బంధువుల ఎంగేజ్‌మెంట్‌కు తీసుకువెళ్లాలని రవళిరెడ్డి తన తండ్రిని కోరింది. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తనకు సెలవులు దొరకలేదని ఫంక్షన్‌కు వీలుపడదని తండ్రి తెలిపాడు.

దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన రవళిరెడ్డి వెంటనే గదిలోకి వెళ్లి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.

వెంటనే కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Advertisement