Advertisement

  • మరొకరిని పెళ్లి చేసుకుంటోందని సూర్యాపేట లో దారుణం...!

మరొకరిని పెళ్లి చేసుకుంటోందని సూర్యాపేట లో దారుణం...!

By: Anji Wed, 16 Dec 2020 2:06 PM

మరొకరిని పెళ్లి చేసుకుంటోందని సూర్యాపేట లో  దారుణం...!

ప్రేమించిన పాపానికి ఆమె లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి....

జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురానికి చెందిన యువతి(21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జీఎన్‌ఎంగా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వంశీ, యువతి కొద్దికాలం ప్రేమించుకున్నారు.

అయితే అతని పద్ధతులు నచ్చకపోవడంతో ఆమె అతనితో తెగతెంపులు చేసుకుని దూరం పెట్టింది. యువతి తల్లిదండ్రులు మరొకరితో వివాహం నిశ్చయం చేయడంతో పెళ్లికి ఒప్పుకుంది. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.

తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటోందని రగిలిపోయిన మాజీ ప్రియుడు వంశీ పైశాచాకానికి దిగాడు. ఆమె తనతో ఉన్న ఫొటోలను వరుడు, అతని కుటుంబ సభ్యులకు పంపించడంతో పెళ్లి రద్దయింది.

దీంతో హైదరాబాద్‌లో ఉన్న యువతిని తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి తీవ్రంగా మందలించారు. కొద్దిరోజులు సూర్యాపేటలోని బంధువుల ఇంట్లో ఉండమని చెప్పి పంపించారు.

ఈ నెల 6వ తేదీన సూర్యాపేట చింతలచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె 9 వ తేదీన బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు.

ఇంటి నుంచి బయటికెళ్లిన కూతురు తిరిగిరాలేదని తెలిసి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తిమ్మాపురం గ్రామ పొలాల్లో యువతి మృతదేహం పడి ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించగా యువతి విగతజీవిగా కనిపించింది. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెళ్లి ఆగిపోయేలా చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన వంశీ, అతనికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Advertisement