Advertisement

  • ఆటో డ్రైవర్ స్క్రూడ్రైవర్ తో యువతిపై దాడి చేసి హత్య చేశాడు... ఎవరూ గుర్తు పట్టకుండా తగులబెట్టాడు..!

ఆటో డ్రైవర్ స్క్రూడ్రైవర్ తో యువతిపై దాడి చేసి హత్య చేశాడు... ఎవరూ గుర్తు పట్టకుండా తగులబెట్టాడు..!

By: Anji Thu, 17 Dec 2020 5:08 PM

ఆటో డ్రైవర్ స్క్రూడ్రైవర్ తో యువతిపై దాడి చేసి హత్య చేశాడు... ఎవరూ గుర్తు పట్టకుండా తగులబెట్టాడు..!

ప్రపంచ వ్యాప్తంగా దిశ ఘటన తరువాత మహిళల రక్షణ కోసం చట్టాలను మరింత కఠినం చేసిన సంగతి తెలిసిందే. అయిన మహిల పై దాడులు పెరుగుతూనే ఉన్నాయి.

మహిళల రక్షణ కోసం పలు చట్టాలను తీసుకొచ్చినా, నేరాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఇదిలా ఉంటె,హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ లో ఫిరోజ్ అనే ఆటో డ్రైవర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆటోలో ఎక్కిన యువతిపై అత్యాచార యత్నం చేశాడు.

యువతి ప్రతిఘటించడంతో స్క్రూడ్రైవర్ తో యువతిపై దాడి చేసి హత్య చేశాడు. మృతి చెందిన యువతి మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా తగులబెట్టాడు. మహిళ ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు దుస్తులు తొలగించి, ముఖాన్ని ఇటుకతో ఛిద్రం చేశాడు.

దిశ తరహాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చాంద్రాయణ గుట్టకు వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయంలో యువతి ఫాతిమా ఆటో ఎక్కగా ఈ ఘటన జరిగింది.

ఇప్పటికే నిందితుడు ఫిరోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. అయితే ఈ ఘటన పై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

Advertisement