Advertisement

మిస్టరీగా మారిన సూర్యాపేట యువతీ మరణం

By: Sankar Tue, 03 Nov 2020 6:58 PM

మిస్టరీగా మారిన సూర్యాపేట యువతీ మరణం


సూర్యాపేట జిల్లాలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. యువతిపై అత్యాచారం చేశారని.. అందువల్లే ఆమె చనిపోయిందంటూ బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. జిల్లాలోని చింతలపాలెం మండలం పిక్లానాయక్ తండాకు చెందిన యువతి(20) నల్గొండ గురుకుల కళాశాలలో డిగ్రీ చదువుతోంది.

ఆమె పీజీ ఎంట్రన్స్ పరీక్షకు కోచింగ్ తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లింది. ఘట్‌కేసర్‌లోని ఓ హాస్టల్లో చేరింది.మరుసటి రోజే హాస్టల్ నిర్వాహకులు యువతి తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆరోగ్యం బాలేదని చెప్పారు. కూతురితో ఫోన్‌లో మాట్లాడించారు. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. యువతిని హైదరాబాద్ తీసుకెళ్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది.

యువతి మృతిపై అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతిది సహజ మరణం కాదని.. అత్యాచారం చేయడం వల్లే చనిపోయిందంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి వద్దే బైఠాయించారు

Tags :
|
|

Advertisement