యోగాతో రోగాలను దీటుగా ఎదుర్కోవచ్చు: ప్రధాని మోదీ
By: chandrasekar Mon, 22 June 2020 5:43 PM
అంతర్జాతీయ యోగా
దినోత్సవం సందర్భంగా ఆన్లైన్ ద్వారా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రోగ
నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగాలో అనేక ఆసనాలున్నాయని చెప్పారు. యోగా మన
జీవక్రియను శక్తివంతంగా చేస్తుందని, అందులోని ఆసనాలు మన శరీరాన్ని బలోపేతం చేస్తాయన్నారు.
ప్రపంచం యావత్తు యోగాను గుర్తించిందని చెప్పారు.
యోగా ద్వారా అనేక
ఇబ్బందులను అధిగమించవచ్చని, రోగాలను దీటుగా ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుందని
ప్రధాని మోదీ ప్రకటించారు. కరోనా వైరస్ మన శ్వాసవ్యవస్థపై త్రీవ ప్రభావం
చూపుతుందని, శ్వాస వ్యవస్థను బలోపేతం చేసేందుకు యోగాలో అనేక
ఆసనాలున్నాయని చెప్పారు. అందులో ప్రాణాయామం ఒకటని, అది ఒకరకంగా శ్వాస
వ్యాయామం లాంటిదని పేర్కొన్నారు.
మన శ్వాసవ్యస్థ, రోగ
నిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు ప్రాణాయామం ఎంతో మద్దతు ఇస్తుందని, ప్రాణాయామాన్ని
రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు.
యోగా ద్వారా శాంతి, సహనశక్తి, మనోధైర్యం, ఉల్లాసం
పెంపొందుతాయని చెప్పారు.
శారీరక దృఢత్వంతోపాటు
మానసిక స్థిరత్వం మెరుగుపడుతుందని వెల్లడించారు. కరోనా ఉధృతి దృష్ట్యా సామూహిక
కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని, అందువల్ల ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలిసి యోగా
నిర్వహిస్తున్నామని తెలిపారు.