Advertisement

  • చంద్రబాబు టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

చంద్రబాబు టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

By: chandrasekar Mon, 24 Aug 2020 4:55 PM

చంద్రబాబు టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్


చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టార్గెట్ చేసి ట్విట్టర్ వేదికంగా విమర్శలు చేశారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ రమేష్ ఆస్పత్రి కరోనా సెంటర్ ప్రమాదంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘చంద్రబాబూ నేరుగా అడుగుతున్నా ఇంతకీ డాక్టర్ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా? లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్, డాక్టర్ రమేష్ ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రెండు వారాల క్రితం విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన రమేష్ కరోనా‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది చనిపోయారు.

ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్‌ యజమాని శ్రీనివాస్‌ బాబుకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు విచారణను కూడా వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి విజయవాడ సీపీ శ్రీనివాసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు.ఈ కేసుకు సంబంధించి చెన్నె, బెంగళూరు, హైదరాబాద్‌కి స్పెషల్ టీమ్‌లను పంపామని ఆస్పత్రి, హోటల్ మధ్య ఎంవోయూ ఉందని తొలుత చెప్పారని ఇప్పటి వరకు ఆ ఎంవోయూ పోలీసులకు ఇవ్వలేదన్నారు. ఆస్పత్రి యాజమాన్యం సహకరించాలని.. తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :
|

Advertisement