Advertisement

  • మూడు రాజధానులతో చంద్రబాబుకు తప్ప ప్రజలకు నష్టం లేదు - వైసీపీ ఎమ్మెల్యేలు

మూడు రాజధానులతో చంద్రబాబుకు తప్ప ప్రజలకు నష్టం లేదు - వైసీపీ ఎమ్మెల్యేలు

By: Anji Fri, 18 Dec 2020 3:08 PM

మూడు రాజధానులతో చంద్రబాబుకు తప్ప ప్రజలకు నష్టం లేదు - వైసీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజధానిపై రెఫరెండంతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసరగా..

చంద్రబాబు సవాల్ కు అధికార పార్టీ కూడా ప్రతి సవాల్ విసురుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ లు ఇస్తున్నారు.

తాజాగా గుంటూరు లో మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల ర్యాలీ చేశారు. మూడు రాజధానుల వల్ల ఏ ప్రాంతానికి నష్టం ఉండదన్నారు ఎమ్మెల్యే మద్దాలి గిరి.

మూడు రాజధానులతో చంద్రబాబుకు తప్ప ప్రజలకు నష్టం లేదని.. ఐదేళ్లలో అమరావతిలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. రాజధాని రెఫరెండతో రాజీనామాకు తాను సిద్ధమన్నారు ఎమ్మెల్యే ముస్తఫా..

జగన్ ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాను అని అన్నారు. జగన్ తమ అధినాయకుడని.. ఆయన చెప్పిన బాటలో నడవాలి కాబట్టి.. ఆయన ఓకే అంటే ఆ మరు క్షణమే రాజీనామా చేస్తాను తెలిపాడు.

Tags :

Advertisement