Advertisement

  • వైసీపీ ఎమ్యెల్యే నాగేశ్వర్ రావు కు కరోనా పాజిటివ్

వైసీపీ ఎమ్యెల్యే నాగేశ్వర్ రావు కు కరోనా పాజిటివ్

By: Sankar Mon, 09 Nov 2020 1:30 PM

వైసీపీ ఎమ్యెల్యే నాగేశ్వర్ రావు కు కరోనా పాజిటివ్


ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా ఉధృతి తగ్గిందని చెప్పలేం. తాజాగా నమోదయిన కేసులతో కరోనా కేసులు 84.29 లక్షలు దాటిపోయాయి.

సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజగా వైసీపీ కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వర్ రావు కరోనా బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు.

ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వ్యక్తులు టెస్ట్ చేయించుకోవాలని నాగేశ్వరరావు కోరారు.

Tags :
|

Advertisement