Advertisement

  • వైసీపీ బహిష్కృత నేతలు సందీప్, సురేష్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ బహిష్కృత నేతలు సందీప్, సురేష్ సంచలన వ్యాఖ్యలు

By: chandrasekar Fri, 06 Nov 2020 3:53 PM

వైసీపీ బహిష్కృత నేతలు సందీప్, సురేష్ సంచలన వ్యాఖ్యలు


గుంటూరుజిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ బహిష్కృత నేతలు సందీప్, సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రాణహాని ఉందని ముఖ్యమంత్రి జగనే తమను కాపాడాలని కోరారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తాడికొండ టీడీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. భూ కుంభకోణాలు చేస్తున్నారని దళితుల భూముల్ని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఇదంతా చేసినందుకు ఎంపీ సురేష్‌కు మందడం పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ గిఫ్ట్‌గా వచ్చిందన్నారు. ఎంపీ నందిగం సురేష్, ఉండవల్లి శ్రీదేవి అవినీతిని ప్రశ్నించినందుకు టీడీపీ నేతలతో కలిసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో పాటూ ఇతర అంశాలపై కోర్టుకు వెళ్ళినందుకు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని సందీప్, సురేష్ ఆరోపించారు.

అనుమానస్పదంగా ట్రాక్టర్లు బోల్తా పడుతున్నాయని తాను వైఎస్సార్‌సీపీ కోసం ఊడిగం చేశానని రాజన్న కాంటీన్లు నిర్వహించాను అన్నారు. అలాంటి తమపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలైన కారుమంచి అప్పారావు, రమేష్, జొన్నలగడ్డ కిషోర్ వ్యక్తులతో ఎంపీ అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తమపై పగబట్టి ఒక్క రోజులో మూడు కేసులు పెట్టారని కేసులు వెనక్కి తీసుకోవాలని తమపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. పార్టీ కోసం నిరంతరం పని చేశామని నందిగం సురేష్ మనిషి ముసుగులో ఉన్న నాగుపాము అని మూడు రాజధానుల ఉద్యమం నడుపుతుంది నందిగం సురేష్ అని వారిద్దరు ఆరోపణలు చేసారు.

Tags :

Advertisement