Advertisement

  • షియోమీ ఎంఐ స్మార్ట్‌వాచ్, స్మార్ట్ బ్యాండ్‌5 త్వరలో భారత్‌లో లాంచ్

షియోమీ ఎంఐ స్మార్ట్‌వాచ్, స్మార్ట్ బ్యాండ్‌5 త్వరలో భారత్‌లో లాంచ్

By: chandrasekar Sat, 19 Sept 2020 6:12 PM

షియోమీ ఎంఐ స్మార్ట్‌వాచ్,  స్మార్ట్ బ్యాండ్‌5 త్వరలో భారత్‌లో లాంచ్


సెప్టెంబర్‌ 29న స్మార్టర్‌ లివింగ్‌ 2020 ఈవెంట్‌ను ప్రముఖ చైనీస్‌ కంపెనీ షియోమీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వర్చువల్‌ కార్యక్రమంలో ఎంఐ స్మార్ట్‌ బ్యాండ్‌5ని భారత్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది.

షియోమీ తొలిసారిగా భారత్‌లో స్మార్ట్‌వాచ్‌ను కూడా ఆవిష్కరించనున్నట్లు టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఎం వాచ్‌ కలర్‌ పేరుతో వస్తోన్న ఈ స్మార్ట్‌వాచ్‌ను ఇప్పటికే చైనాలో విడుదల చేసింది.

సెప్టెంబర్‌ 29న ఎంఐ స్మార్ట్‌ బ్యాండ్‌తో పాటు వాచ్‌ను కూడా భారత మార్కెట్లోకి తీసుకురానున్నది. ఇదే వాచ్‌ మోడల్‌ను చైనా మార్కెట్లో ఎం వాచ్‌ రివాల్వ్‌ లేదా షియోమీ వాచ్‌ ఎస్‌ఈ పేరుతో రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నది. వాచ్‌ ధర సుమారు రూ.7వేల వరకు ఉండనుంది. ఎంఐ వాచ్‌ కలర్‌ హార్ట్‌రేట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంది.

Tags :
|

Advertisement