Advertisement

షియోమీ ఎంఐ 11 సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో...

By: chandrasekar Wed, 23 Dec 2020 5:03 PM

షియోమీ ఎంఐ 11 సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో...


షియోమీ సంస్థ సరికొత్త ఫీచర్లతో మరో ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధం చేసింది.

ఎంఐ 11 సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్లను త్వరలో భారతదేశంలో ప్రవేశపెట్టనున్నట్లు షియోమి సంస్థ ప్రకటించింది.

కాగా, తొలిసారి స్నాప్‌డ్రాగ్ 888 ప్రాసెసర్‌తో రూపొందించిన ఎంఐ 11 సిరీస్ ఫోన్లను డిసెంబర్ 28వ తేదీన చైనాలో లాంచ్ చేయనున్నట్లు షియోమి తెలిపింది.

ఎంఐ 11 సిరీస్ ఫీచర్లు...

ఎంఐ 11, ర్యామ్ 8 జీవీ, ఇంటర్నల్ స్టోరేజీ 128 జీబీ, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ కలిగిఉంది.

రేర్ కెమెరా 108 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ అందుబాటులో ఉంది. ఫ్రెంట్ కెమెరా 32 ఎంపీగా ఉంది.

బ్యాటరీ కెపాసిటీ 4780 mah గా అందుబాటులో ఉంది.

ఎంఐ 11 ప్రో ఫీచర్లు...

క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ర్యామ్ 12 జీబీ, ఇంటర్నల్ స్టోరేజీ 256 జీబీగా ఉంది.

రేర్ కెమెరా 108 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ, ఫ్రెంట్ కెమెరా 32 ఎంపీ, బ్యాటరీ సామర్థ్యం 4,970 ఎంఏహెచ్‌గా ఉండనుంది.

Tags :
|
|

Advertisement