షియోమీ అత్యంత చవకైన 108 మెగా పిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ను లాంచ్ చేయడానికి సిద్ధం
By: chandrasekar Mon, 21 Sept 2020 6:43 PM
ప్రముఖ స్మార్ట్ ఫోన్
బ్రాండ్ షియోమీ కెమెరాల విషయంలో మరింత అడ్వాన్స్డ్గా దూసుకుపోవడానికి రంగం
సిద్ధం చేస్తోంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం షియోమీ తన ఫోన్లలో అత్యంత
చవకైన 108 మెగా
పిక్సెల్ కెమెరా ఫోన్ను రూపొందించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ లీక్స్టర్ చైనా సోషల్
మీడియా పోర్టల్ వీబోలో పేర్కొన్నారు. గాంగ్విన్, గాంగ్విన్ ప్రో అనే కోడ్
నేమ్స్తో వచ్చే రెండు ఫోన్లలో ఈ 108 మెగా పిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. వీటిలో
ప్రో వేరియంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా, ప్రో వేరియంట్ కాని
దాంట్లో 64 మెగా
పిక్సెల్ ఉండనుందని తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్లు రెడ్ మీ బ్రాండ్ కింద రానున్నాయని
ఈ పోస్ట్లో తెలిపారు.
మనదేశంలో షియోమీ ఈమధ్యే రెడ్ మీ బ్రాండ్ కింద రెడ్ మీ 9ఐ
స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో 4 జీబీ
ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,299గా
నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,299గా
ఉంది. ఇందులో 6.53 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను షియోమీ అందించింది.
దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉండగా, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్
ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
సెల్ఫీల కోసం ముందువైపు 5
మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్ మీ 9ఐ
పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా,
10W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా దీనిలో అందించారు. వైఫై, 4జీ, వోల్టే
సపోర్ట్, బ్లూటూత్
5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో
యూఎస్ బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు
దీనిలో అందించారు. దీని మందం 0.9 మిల్లీమీటర్లుగానూ, బరువు 194
గ్రాములు.