Advertisement

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

By: chandrasekar Tue, 06 Oct 2020 1:10 PM

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ


ఐపీఎల్ 13వ సీజన్‌లో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టారు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కొత్త రికార్డు నమోదు చేశారు. టీ 20 క్రికెట్‌లో ఒకే జట్టుకు అత్యధికంగా కేప్టెన్‌గా ఉన్న ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ నిలిచారు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కోసం కోహ్లీ 197 వ మ్యాచ్‌కు హాజరయ్యాడు. సోమర్‌సెట్ తరఫున 196 టీ 20 మ్యాచ్‌లు ఆడిన జేమ్స్ హిల్డ్రెత్‌ను విరాట్‌ కోహ్లీ అధిగమించాడు. జేమ్స్‌ హిల్డెత్‌ తర్వాత మహేంద్రసింగ్‌ ధోని, సమిత్ పటేల్ మూడో స్థానంలో ఉన్నారు. ఇద్దరూ వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, నాటింగ్హామ్‌షైర్ కొరకు 189 మ్యాచులు ఆడారు.

ప్రస్తుత౦ ఐపీఎల్ సీజన్‌ ఆరంభంలో ఫామ్‌కు దూరంగా ఉన్న కోహ్లీ రాజస్థాన్ రాయల్స్‌పై అజేయంగా 72 పరుగులు చేసి తన జట్టును ఎనిమిది వికెట్ల విజయానికి నడిపించారు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన ఆర్‌సీబీ మూడు విజయాలు అందుకుంది.

Tags :
|
|
|

Advertisement