చందా నగర్ లో దారుణం ...భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
By: Sankar Mon, 19 Oct 2020 07:41 AM
హైదరాబాద్ లో మరో ఘోరం జరిగింది. భవనంపై నుంచి దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చందానగర్లోని ఓ భవనంపై నుంచి దూకి శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.
భర్త శబరీష్ వేధింపులే తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీవిద్య నిన్న భర్త శబరీష్తో గొడవపడినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ సంఘటనపై చందానగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
6 నెలల క్రితం వరంగల్కు చెందిన శబరీష్తో కరీంనగర్కు చెందిన శ్రీవిద్య వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ బిడ్డ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Tags :
women |
suicide |