Advertisement

  • ప్రియుడి ఇంటిముందు ఆత్మహుతి చేసుకున్న యువతీ.. పట్టించుకోని జనం

ప్రియుడి ఇంటిముందు ఆత్మహుతి చేసుకున్న యువతీ.. పట్టించుకోని జనం

By: Sankar Tue, 01 Sept 2020 4:49 PM

ప్రియుడి ఇంటిముందు ఆత్మహుతి చేసుకున్న యువతీ.. పట్టించుకోని జనం


ప్రియుడి ఇంటిముందు ఓ మహిళ అత్మహుతికి పాల్పడింది. అయితే మంటల్లో కాలిపోతున్న ఆమెను రక్షించకుండా చుట్టుపక్కలవారు చోద్యం చూస్తూ తమ ఫోన్ లలో వీడియోలు తీశారు. ఈ ఘటన దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌ కేసిపట్టి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

భర్తను విడిచిన మాలతీ కొంతకాలం క్రితం డ్రైవర్‌ సతీష్‌ అనే వ్యక్తిని రహస్యంగా వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. వారికి ఒక బిడ్డ కూడా ఉంది. అయితే సతీష్ మాలతీ ని మోసం చేసి మరో యువతిని పెళ్లాడాడు. దాంతో మనస్థాపానికి గురైన ఆమె పక్కనే ఉన్న టీ కొట్టువద్ద తన కూతురును ఉంచి సతీష్ ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడింది.

అయితే ఆమె కాలిపోతున్న సమయంలో చుట్టుపక్కల జనాలు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. చాలాసేపటి తరవాత ఓ వ్యక్తి తన పంచ సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Tags :
|
|
|

Advertisement