Advertisement

  • కరోనా వచ్చింది అని తల్లిని పొలం దగ్గర వదిలేసి వచ్చిన కుమారులు

కరోనా వచ్చింది అని తల్లిని పొలం దగ్గర వదిలేసి వచ్చిన కుమారులు

By: Sankar Sun, 06 Sept 2020 2:29 PM

కరోనా వచ్చింది అని తల్లిని పొలం దగ్గర వదిలేసి వచ్చిన కుమారులు


కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్నే కాదు, రక్త సంబంధాలను కూడా కాలరాస్తున్నాయి. రక్తం పంచి జన్మనిచ్చిన మాతృమూర్తినే కడుపున పుట్టినవాళ్లు కాదనుకున్నారు.

తల్లికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఇంట్లో నుంచి తీసుకువెళ్లి వ్యవసాయ బావి వద్ద వదిలేశారు. ఈ సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో చోటుచేసుకుంది. మారబోయిన లచ్చమ్మ (82)కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తల్లిని ఒంటరిగా వ్యవసాయ బావి వద్ద వదిలేసారు కన్న కొడుకులు.

బాధితురాలికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నా ఊరికి దూరంగా అనాథలా బిడ్డల కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు లచ్చమ్మకు పాజిటివ్‌ ఉండటంతో ఆ చుట్టుపక్కల బావులు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు..

Tags :
|
|
|

Advertisement