Advertisement

  • రోజుల వయస్సు గల మనువరాలిని లక్ష రూపాయలకు అమ్మిన అమ్మమ్మ

రోజుల వయస్సు గల మనువరాలిని లక్ష రూపాయలకు అమ్మిన అమ్మమ్మ

By: Sankar Fri, 28 Aug 2020 10:26 PM

రోజుల వయస్సు గల మనువరాలిని లక్ష రూపాయలకు అమ్మిన అమ్మమ్మ


కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోజుల వయసు గల ఓ పసిపాపను విక్రయించడం కలకలం రేపుతోంది. ఇందుకు పాల్పడింది ఆ శిశువు అమ్మమ్మే కావడం గమనించదగ్గ విషయం.

శుక్రవారం ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నాలుగు నెలల పసికందును అమ్మమ్మ అమ్మేసింది. పసిపాపను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తిరుపతమ్మ సంపత్ దంపతులు రూ.1.1 లక్షలకు కొనుగోలు చేసినట్లు తేలింది. అయితే, ఈ అమ్మకం వ్యవహారం కన్నతల్లికి తెలికపోవడం గమనార్హం.

పసిపిల్ల కనపడకపోయేసరికి కన్నతల్లి పద్మ తన తల్లిపై అనుమానంతో నిలదీసింది. దీంతో ఆ పాపను అమ్మిన విషయాన్ని పద్మ తల్లి కనకమ్మ తెలిపింది. దీంతో పసి పాప తల్లి వెంటనే తన భర్త రమేష్‌కు సమాచారం ఇచ్చింది. వెంటనే ఆయన రంగంలోకి దిగి అత్తగారితో గొడవకు దిగాడు. కాసేపట్లోనే బిడ్డ అమ్మకానికి సంబంధించిన సంగతి స్థానికంగా వ్యాపించిపోయింది.ఈ క్రమంలో స్థానికులు 100కు ఫోన్ చేసి బిడ్డ అమ్మకం ఘటనపై ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా పసిపాప అమ్మకం నిజమని తేలింది. పోలీసులు కలగజేసుకొని విక్రయించిన పసిపాపను మళ్ళీ తల్లి ఒడికి చేర్చారు.

Tags :
|
|
|

Advertisement