Advertisement

  • మాల్ లో వినాయకుడి విగ్రహాలు ధ్వంసం చేసిన మహిళ..ఎక్కడో తెలుసా !

మాల్ లో వినాయకుడి విగ్రహాలు ధ్వంసం చేసిన మహిళ..ఎక్కడో తెలుసా !

By: Sankar Mon, 17 Aug 2020 1:19 PM

మాల్ లో వినాయకుడి విగ్రహాలు ధ్వంసం చేసిన మహిళ..ఎక్కడో తెలుసా !


ఈ నెలాక‌రున వినాయ‌క చ‌వితి వ‌స్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ్యాప్తితో ఆ సంబ‌రాలు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయినా ప్ర‌జ‌లు ఎవ‌రింట్లో వాళ్లు జ‌రుపుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక మ‌హిళ బుర్ఖా ధరించి షాపింక్‌గు వెళ్లింది. అక్క‌డ వినాయ‌కుడి విగ్ర‌హాలు క‌నిపించ‌డంతో ఒక్క‌సారిగా మండిపడింది. ఇక్క‌డ ఈ విగ్ర‌హాలు ఎందుకు పెట్టారంటూ మాల్ య‌జ‌మాని మీద అరిచింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

‘‘మ‌హ్మ‌ద్ బెన్ ఇస్సాకు చెందిన దేశంలో ఇలాంటి విగ్ర‌హాలు అనుమ‌తిస్తారా' అంటూ ఒక్కో విగ్ర‌హాన్ని కిందేసి ప‌గ‌ల‌గొట్టింది. 'ఈ విగ్రహాల‌ను ఎవ‌రు పూజించినా ఊరుకోను. పైగా పోలీసుల‌కు చెప్పుకో పో' అంటూ అక్క‌డున్న మ‌రో మ‌హిళ య‌జ‌మానితో అన్న‌ది. ఇదంతా కెమెరాలో రికార్డు అయింది.

ఈ సంఘ‌ట‌న‌పై బ‌హ్రెయిన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. వియాయ‌కుడి విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసి వారి మ‌తాన్ని అగౌర‌వ ప‌రిచినందుకు 54 ఏండ్ల మ‌హిళ మీద కేసు న‌మోదు చేశారు.

Tags :
|
|
|
|
|
|
|

Advertisement