Advertisement

  • భర్తతో గొడవ..పిల్లలను చెరువులోకి తోసేసి.. చివరి క్షణంలో మనసు మార్చుకున్న భార్య

భర్తతో గొడవ..పిల్లలను చెరువులోకి తోసేసి.. చివరి క్షణంలో మనసు మార్చుకున్న భార్య

By: Sankar Mon, 15 June 2020 1:09 PM

భర్తతో గొడవ..పిల్లలను చెరువులోకి తోసేసి.. చివరి క్షణంలో మనసు మార్చుకున్న భార్య


భర్తతో గొడవ పడిన ఓ మహిళ క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసింది.. తాను కూడా చనిపోదామని భావించింది. కానీ చివరి క్షణంలో మనసు మార్చుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కుమారుడు చనిపోగా.. కుమార్తె శవం కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పెన్‌పహడ్ మండలంలోని సింగిరెడ్డిపాలేనికి చెందిన నాగమణి, హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌‌కు పదేళ్ల క్రితం పెళ్లయ్యింది. ప్రశాంత్ దంపతులు విద్యానగర్‌లో నివాసం ఉంటుండగా.. స్క్రాప్ షాపు నడుపుతున్నారు. వీరికి జ్యోతి మాధవి, హర్షవర్ధన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ప్రశాంత్ మద్యానికి బానిస కావడంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం రాత్రి ఈ దంపతుల మధ్య గొడవ జరగడంతో నాగమణి తీవ్ర మనో వేదనకు లోనైంది. ఆవేశంలో ఇద్దరు పిల్లలను తీసుకొని 1.5 కి.మీ. దూరంలోని సద్దుల చెరువు కట్టపైకి చేరుకుంది. ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసింది. తర్వాత తాను కూడా చెరువులోకి చెరువులోకి దూకబోయి.. చివరి క్షణంలో వెనక్కి తగ్గింది.

రాత్రంతా చెరువు కట్ట దగ్గరే ఉన్న ఆమె పిల్లల కోసం గాలించింది. హర్షవర్ధన్ మృతదేహం పైకి తేలడంతో.. పట్టుకొని ఏడుస్తుండగా.. స్థానికులు గమనించి ఆరా తీశారు. ఆమె చెప్పింది విని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆమె కుమార్తె శవం కోసం చెరువులో గాలిస్తున్నారు.





Tags :
|
|
|

Advertisement