Advertisement

  • ఇడ్లీలు బాలేదు అన్నందుకు చిన్నారిని కొట్టి చంపేసిన చిన్నారి పెద్దమ్మ

ఇడ్లీలు బాలేదు అన్నందుకు చిన్నారిని కొట్టి చంపేసిన చిన్నారి పెద్దమ్మ

By: Sankar Thu, 10 Sept 2020 4:21 PM

ఇడ్లీలు బాలేదు అన్నందుకు చిన్నారిని కొట్టి చంపేసిన చిన్నారి పెద్దమ్మ


ఇడ్లి బాలేదు అన్నందుకు అయిదేళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకుంటుంది ఒక కసాయి తల్లి..తల్లి లేని పిల్లను మంచిగా చేసుకోవాల్సింది పోయి ఈ అఘాయిత్యానికి ఒడి గట్టింది..

ఈ అత్యంత దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కళ్లకురిచ్చి జిల్లా త్యాగదుర్గంకి చెందిన రొసారియో, జయరాణి దంపతులకు కూతురు రెన్సీమేరీ(5) ఉంది. కొద్దికాలం కిందట జయరాణి మృతి చెందడంతో చిన్నారిని అమ్మమ్మ పచ్చయమ్మాల్ ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటోంది. తండ్రి రొసారియో రెండో వివాహం చేసుకుని వేరుగా ఉంటున్నాడు.

పచ్చయమ్మాల్ పెద్దకూతురు, జయరాణి అక్క ఆరోగ్యమేరీకి వివాహం కాకపోవడంతో అదే ఇంట్లో ఉంటోంది. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న చిన్నారి రెన్సీమేరీకి ఆరోగ్యమేరీ ఇడ్లీలు పెట్టింది. అవి నచ్చలేదంటూ చిన్నారి బయటికెళ్లిపోయి ఆడుకుంటోంది. పెట్టిన ఇడ్లీలు తినలేదని ఆగ్రహానికి గురైన ఆరోగ్యమేరీ చిన్నారిపై విరుచుకుపడింది. బయటికెళ్లి బాలికను చావబాదింది. ఇంట్లోకి తీసుకొచ్చి కర్రతో విచక్షణా రహితంగా కొట్టింది.

చిన్నారి కేకలు విన్న స్థానికులు స్పందించి ఆమెను రక్షించి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కళ్లకురిచ్చి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చిన్నారి ప్రాణాలు విడిచింది. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరోగ్యమేరీని అరెస్టు చేసి జైలుకి పంపించారు.



Tags :
|
|
|

Advertisement