పార్కింగ్ చేసిన కారును నడిపే ప్రయత్నంలో మహిళ మృతి
By: chandrasekar Fri, 09 Oct 2020 2:32 PM
పార్కింగ్ చేసిన కారును
నడిపే ప్రయత్నంలో మహిళ కారు డోరు మరియు చెట్టు మధ్య ఇరుక్కుని మృతి చెందింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో
బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. పార్కింగ్ చేసిన కారును నడిపేందుకు నందిని రావు (45) ప్రయత్నించారు.
అయితే ఆ కారు డోర్ తీయగానే రివర్స్ గేర్లో ఉండటంతో ఒక్కసారిగా వెనక్కి
వెళ్లింది. మరోవైపు సమీపంలోని చెట్టు, ఆ కారు మధ్య తక్కువ ఖాళీ ప్రదేశం ఉంది. దీంతో కారు
డోరు, ఆ
చెట్టు మధ్య ఆమె ముఖం, తల ఇరుక్కుపోయాయి. దీంతో సహాయం కోసం కేకలు వేస్తూనే
నందిని చనిపోయింది.
ఈ సంఘటనను చూసి అంతలోనే
అక్కడికి చేరిన స్థానికులు ఆమె మరణించినట్లు గుర్తించారు. కారు పార్కింగ్కు
అడ్డుగా ఉన్న ఆ చెట్టును తొలగించాలని నందిని పలుసార్లు చెప్పినట్లు స్థానికులు
తెలిపారు. కాగా తల, ముఖం చెట్టుకు బలంగా ఢీకొనడంతో నందిని చనిపోయినట్లు
సదాశివనగర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కారును నడిపే ప్రయత్నంలో జరిగిన ఈ
ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గాయాలు తలకు తీవ్రంగా తగలడం వల్ల
మరణించి ఉంటుందని స్థానికులు తెలిపారు.