జీపు ట్రాక్టర్ ఢీ ..మహిళ మృతి , తొమ్మిది మందికి గాయాలు
By: Sankar Wed, 16 Dec 2020 8:25 PM
జీపును ట్రాక్టర్ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందగా మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. భదాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టి పల్లి శివారులో కొత్తగూడెం- ఇల్లందు ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం ఘటన జరిగింది.
ఇల్లందు మండలం సీతానగర్ గ్రామానికి చెందిన 10 మంది పాల్వంచలో బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభాకార్యానికి జీపులో బయల్దేరారు. అనిశెట్టిపల్లి వద్దకు రాగానే కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు జమాయిల్ కర్రల లోడ్తో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా ఢీకొట్టింది.
ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ సమ్మక్క అనే మహిళ మృతి చెందింది.