Advertisement

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ..

By: Sankar Tue, 21 July 2020 12:15 PM

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ..



ఇటీవల కాలంలో భార్య భర్తల బంధానికి మచ్చ తెచ్చే విధంగా అనేక సంఘటనలు వెలుగులోకి వస్తాయి ..స్మార్ట్ ఫోన్ యుగంలో భార్య భర్తల బంధం పట్టుమని పది రోజులు కూడా నిలవడం లేదు ..వేరే వాళ్ళ మోజులో పడి కట్టుకున్న భర్తను , లేదా భార్యను మోసం చేయడం ఇంకా అడ్డం వస్తే చంపేయడం.. ఇలాంటి సంఘటనలు రోజుకి పదుల సంఖ్యలో జరుగుతున్నాయి ..

తాజాగా ఇలాంటి సంఘటనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో జరిగింది ...తిమ్మరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కట్టుకున్న భార్యే...ప్రియుడితో కలిసి భర్త తిమ్మరాజును హత్య చేసి ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో భార్య, ప్రియుడి కుట్ర వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇక కర్నూల్ జిల్లాలోనే మరొక సంఘటనలో కడుపు నొప్పి తాళలేక కొత్త పెళ్లి అయిన అమ్మాయి తనువు చాలించింది .. గణేకల్‌ గ్రామానికి చెందిన నవ వధువు జయలక్ష్మి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పెద్దతుంబళం ఎస్‌ఐ చంద్ర తెలిపారు.. జయలక్ష్మి కడుపునొప్పి తాళలేక శనివారం ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వైద్యులు రెఫర్‌ చేయగా అక్కడ కోలుకోలేక మృతిచెందిందని ఎస్‌ఐ వివరించారు.

Tags :
|
|

Advertisement