Advertisement

  • తాగి వచ్చి వేధిస్తున్న భర్త బాధ పడలేక గొంతుకోసి చంపిన భార్య..

తాగి వచ్చి వేధిస్తున్న భర్త బాధ పడలేక గొంతుకోసి చంపిన భార్య..

By: Sankar Sun, 01 Nov 2020 11:37 AM

తాగి వచ్చి వేధిస్తున్న భర్త బాధ పడలేక గొంతుకోసి చంపిన భార్య..


అతడొక కార్మికుడు ప్ర‌‌తిరోజు పూటుగా తాగివ‌చ్చి భార్యా పిల్ల‌లను చిత్ర హింస‌ల‌కు గురిచేస్తున్నాడు. విసిగి వేసారిన ఆమె త‌న ఇద్ద‌రు పిల్ల‌లో క‌లిసి అత‌న్ని చంపేసింది. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో జ‌రిగింది. ప‌ట్ట‌ణంలోని అనిల్ కుమార్ అనే వ్య‌క్తి పారిశుద్ధ్య కార్మికుడిగా ప‌నిచేస్తున్నాడు.

అత‌నికి భార్య పికా దేవి, ఇద్ద‌రు మైన‌ర్ కూతుళ్లు ఉన్నారు. త‌ర‌చూ మ‌ద్యం తాగివ‌చ్చి వారిని వేధిస్తున్నాడు. దీంతో ఓపిక న‌శించిన‌వారు గురువారం రాత్రి అత‌న్ని గొంతుకోసి చంపేశారు. అన‌త‌రం తీసుకువెళ్లి స‌మీపంలోని ఓ పార్కులో ప‌డేశారు. శుక్ర‌వారం ఉద‌యం స్థానికులు అత‌ని మృత‌దేహాన్ని గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అయితే మొద‌ట్లో మ‌ద్యం తాగి చనిపోయాడ‌ని పోలీసులు అనుకున్నారు.

అయితే ద‌ర్యాప్తులో అత‌ని వేధింపులు, వికృత చేష్ట‌ల‌కు భ‌రించ‌లేక తామే చంపామ‌ని వారు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసు న‌మోదు చేశారు. మైన‌రు బాలిక‌ల‌ను జువైన‌ల్ హోంకు త‌ర‌లించారు.

Tags :
|
|
|

Advertisement