Advertisement

  • ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో మహిళ దుర్మరణం

ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో మహిళ దుర్మరణం

By: chandrasekar Fri, 25 Sept 2020 11:56 AM

ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో మహిళ దుర్మరణం


జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో విషాదం. ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో మహిళ దుర్మరణం చెందగా డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

దుబ్బపల్లి గ్రామానికి చెందిన సూరం రాజేశ్వరి (45) ఉదయం పొలం పనులకు వెళ్లింది. పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చేందుకు అదే గ్రామం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఎక్కింది.

విలాసాగర్‌ సమీపంలోకి రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి ట్రాలీతో సహా రోడ్డు వెంట బోల్తాపడటంతో ఇంజిన్‌పై కూర్చున్న రాజేశ్వరి ట్రాక్టర్‌ కిందపడి ఘటనా స్థలంలోనే మృతి చెందింది.

డ్రైవర్‌కు తీవ్రగాయాలవడంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :
|
|

Advertisement