సొంత పిన్ని చేతిలో బందీ అయి చిత్రహింసలకు గురి అయిన మైనర్ బాలిక
By: Sankar Wed, 18 Nov 2020 10:23 PM
మైనర్ బాలికను ఆమె చిన్నమ్మే గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాలివి.. పట్టణానికి చెందిన మంగమ్మ పద్నాలుగేళ్ల కూతురుతో కలిసి ఉంటోంది. మంగమ్మ కు ఆమె చెల్లెలు కల్యాణికి మధ్య కొంతకాలంగా భూమితోపాటు అప్పు చెల్లింపు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 7న అక్క మంగమ్మ కుమార్తెను కల్యాణి బట్టలు కొనిస్తానని చెప్పి టాకారోడ్డుకు తీసుకెళ్లింది.
అక్కడ మరో వ్యక్తితో కలిసి గదికి బంధించింది. బాలిక కేకలు వేయకుండా నోట్లో రుమాళ్లు కుక్కారు. మూడ్రోజుల పాటు ఇక్కడి బంధించి అనంతరం బైక్పై నల్గొండ రైల్వే స్టేషన్వద్దకు తీసుకెళ్లి మరో గదిలో బంధించి తీవ్రంగా కొట్టారు. 11 రోజుల పాటు నిర్భంధించి మంగళవారం అర్ధరాత్రి తీసుకొచ్చి బాలిక నివాసానికి సమీపంలో ఆమెను వదిలేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు.
బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి ఈ నెల 8న వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు గాలింపు బాలిక తీసుకొచ్చి వదిలేశారు. బాలిక వాంగ్మూలం నమోదు చేశామని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని వన్టౌన్పోలీసులు చెప్పారు.