Advertisement

  • కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న వజ్రాల వేట .. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన మహిళ

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న వజ్రాల వేట .. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన మహిళ

By: Sankar Wed, 21 Oct 2020 08:58 AM

కర్నూలు  జిల్లాలో కొనసాగుతున్న వజ్రాల వేట .. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన మహిళ


కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. తొలికరి తర్వాత వర్షాలు కురుస్తుండటంతో స్థానికులంతా వజ్రాల వేటలో బిజీ అయ్యారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చనే ఆశతో గాలింపు చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి. తాజాగా తుగ్గలి మండలం జీ ఎర్రగుడిలో ఓ మహిళ వజ్రం దొరికింది. పొలం పనులు చేస్తున్న సమయంలో ఈ వజ్రం బయటపడింది. రూ. 11 లక్షలకు ఓ వ్యాపారికి ఆ వజ్రాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. నాలుగు నెలల కాలంలో ఇలా చాలామందికి వజ్రాలు దొరికాయి.

ప్రతి ఏటా తొలకరి తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. స్థానికులు పొలాల్లో వజ్రాల వేటలో బిజీ అవుతున్నారు. కొద్దిరోజులుగా వర్షాలూ కురుస్తుండటంతో వజ్రాలు పొలాల్లో పైకి లేస్తున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలో కూడా ఖరీదైన వజ్రం దొరకగా.. ఓ వ్యాపారికి అమ్మినట్లు తేలింది. పోలీసులు కూడా ఈ వ్యవహారంపై ఆరా తీశారు

Tags :
|

Advertisement