Advertisement

  • పొలం పనులు చేస్తున్న మహిళకు దొరికిన నాలుగు క్యారెట్ల వజ్రం..

పొలం పనులు చేస్తున్న మహిళకు దొరికిన నాలుగు క్యారెట్ల వజ్రం..

By: Sankar Thu, 10 Sept 2020 3:08 PM

పొలం పనులు చేస్తున్న మహిళకు దొరికిన నాలుగు క్యారెట్ల వజ్రం..


కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. తొలికరి తర్వాత వర్షాలు కురుస్తుండటంతో స్థానికులంతా వజ్రాల వేటలో బిజీ అయ్యారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చనే ఆశతో గాలింపు చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి. తాజాగా తుగ్గలి మండలం పగిడిరాయిలో ఓ మహిళకు వజ్రం దొరికింది. పొలం పనులు చేస్తున్న సమయంలో మహిళకు 4 క్యారెట్ల వజ్రం లభించింది. ఆ మహిళ రూ. 3.5 లక్షలకు గుత్తిలోని ఓ వ్యాపారికి ఆ వజ్రాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. నాలుగు నెలల కాలంలో ముగ్గురికి వజ్రాలు దొరికాయి.

ప్రతి ఏటా తొలకరి తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. స్థానికులు, రైతులు పొలాల్లో వజ్రాల వేటలో బిజీ అవుతున్నారు. కొద్దిరోజులుగా వర్షాలూ కురుస్తుండటంతో వజ్రాలు పొలాల్లో పైకి లేస్తున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలో కూడా కొందరికి వజ్రాలు దొరికాయి. వీటిని గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.

Tags :
|

Advertisement