Advertisement

  • అనంతపురంలో విషాదం ...అత్త మరణవార్త విని చనిపోయిన కోడలు

అనంతపురంలో విషాదం ...అత్త మరణవార్త విని చనిపోయిన కోడలు

By: Sankar Mon, 28 Sept 2020 11:54 AM

అనంతపురంలో విషాదం ...అత్త మరణవార్త విని చనిపోయిన కోడలు


మాములుగా కుటుంబాలలో అత్తా కోడళ్ళకు అంతగా సంఖ్యత ఉండదు అని భావిస్తుంటారు..అయితే అత్తా చనిపోయిన విషయం తెలిసి కోడలు కూడా మృతి చెందిన ఘటన అనంతపురం లో జరిగింది...

వివరాల్లోకి వెళ్తే అమడగూరు మండలం కస్సముద్రంకి చెందిన వెంకటరమణమ్మ అనే మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. శనివారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బీపీ లెవల్స్ పెరగడంతో హుటాహుటినా కుటుంబ సభ్యులు ఆమెను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచింది.

వెంకట రమణమ్మమృతదేహాన్ని చూసి కోడలు మణేమ్మ అక్కడే కుప్పకూలి పోయింది. బంధువులు ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు వదిలింది. ఈ కుటుంబంలోనే ఏడేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో వెంకటరమణమ్మ భర్త ఆంజనేయులు చనిపోయాడు.. రెండేళ్ల క్రితం మణేమ్మ భర్త కూడా కన్నుమూశాడు. ఇప్పుడు ఒకే రోజున అత్తా కోడళ్లు ఇద్దరూ ఒకేరోజు చనిపోవడం కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదాన్ని నింపింది. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :
|
|
|

Advertisement