Advertisement

  • పట్నం నుంచి ఊరు వెళ్లడం ఇష్టంలేక వివాహిత ఆత్మహత్య

పట్నం నుంచి ఊరు వెళ్లడం ఇష్టంలేక వివాహిత ఆత్మహత్య

By: Sankar Fri, 09 Oct 2020 4:22 PM

పట్నం నుంచి ఊరు వెళ్లడం ఇష్టంలేక వివాహిత ఆత్మహత్య


కరోనా సమయంలో లక్షలాది మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులు కొంతమంది సొంతఊరికి వెళ్లి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

పూణే రాజ్ గురు నగర్ లోని రక్షేవాడిలో అంకిత్, యోగితా బాగల్ దంపతులు నివసిస్తున్నారు. భర్త ఉద్యోగం కోల్పోవడంతో కొన్ని రోజులుగా ఇంటివద్దనే ఉంటున్నాడు. అయితే, ఎక్కువ కాలం సిటీలో ఉంటె ఉన్న డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి సొంత గ్రామానికి వెళదామని భార్యతో చెప్పగా ఆమె అంగీకరించలేదు. అయితే, భర్త ఊరు వెళ్లి వచ్చే సమయానికి ఘోరం జరిగిపోయింది. ఇంటికి వచ్చిన భర్త అనేకమార్లు డోర్ కొట్టాడు. కానీ, భార్య డోర్ తీయలేదు.

అనుమానం వచ్చిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం తెలిపి వారిని తీసుకొని వచ్చాడు. డోర్ పగలగొట్టి చూడగా, గదిలో భార్య, ఏడాది వయసు చిన్నారి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సొంత ఊరికి వెళ్లేందుకు ఇష్టంలేక ఆమె ఇలా చేసిందని భర్త పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|

Advertisement