డ్రెయినేజీలో పడ్డ మహిళ... మృతదేహం అరేబియా సముద్రంలో
By: chandrasekar Tue, 06 Oct 2020 1:20 PM
రెండు రోజుల క్రితం
ముంబైలోని ఘాట్కోపర్లో 32 ఏళ్ల మహిళ డ్రెయినేజీలో పడిపోయింది. అయితే ఆమె మృతదేహం అరేబియా సముద్రంలో కనిపించింది.
డ్రెయినేజీ నుంచి 20
కిలోమీటర్ల దూరంలో ఉన్న హజి అలీ దర్గా తీరంలో ఆ మహిళ మృతదేహం లభించినట్లు
పోలీసులు పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల
వరదలు రావడంతో అసల్ఫా వద్ద ఉన్న డ్రెయినేజీలో అనుకోకుండా ఆ మహిళ పడిపోయింది.
ఘాట్కోపర్ పోలీసు స్టేషన్లో
సదరు మహిళ మిస్సైనట్లు కేసు నమోదు చేశారు.
మృతదేహానికి ఉన్న దుస్తులు, ఆభరణాల ఆధారంగా ఆ మహిళను కుటుంబీకులు
గుర్తించారు. హజీ అలీ దర్గా లోటస్
పాయింట్ వద్ద మహిళ మృతదేహం లభించినట్లు టార్డియో పోలీసు స్టేషన్ సీనియర్
ఇన్స్పెక్టర్ ఫిరోజ్ భగవాన్ తెలిపారు.
Tags :
woman |
body |
found |