- హోమ్›
- వార్తలు›
- రిటైర్ అయ్యే లోపు ఇంగ్లాండ్ లో యాషెస్ , ఇండియాలో టెస్ట్ సిరీస్ సాదించాలి ..స్టీవ్ స్మిత్
రిటైర్ అయ్యే లోపు ఇంగ్లాండ్ లో యాషెస్ , ఇండియాలో టెస్ట్ సిరీస్ సాదించాలి ..స్టీవ్ స్మిత్
By: Sankar Wed, 05 Aug 2020 7:54 PM
స్టీవ్ స్మిత్ ప్రస్తుత ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో అత్యున్నత ఆటగాడు ..ఆడిన అన్ని దేశాలలో పరుగుల వరద పారిస్తున్న స్మిత్ తాను రిటైర్మెంట్ అయ్యే లోపు ఒక రెండు లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు ..అవే ఇంగ్లండ్లో యాషెస్ సిరీస్లో గెలువడం, భారత్లో టెస్టు సిరీస్ సాధించడం ..
ఈ రెండు పెద్ద శిఖరాలు అధిరోహించడం లాంటిదని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. తన కెరీర్ ముగిసేలోపు ఆ రెండు లక్ష్యాలను సాధించాలని అనుకుంటున్నట్టు బుధవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. గతేడాది ఇంగ్లిష్ గడ్డపై చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్పై యాషెస్ను డ్రాగా ముగించడం నిరాశ కలిగించిందని స్మిత్ చెప్పాడు. భారత్లో ఆస్ట్రేలియా 2022 అక్టోబర్లో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.
ఆ రెండు పెద్ద శిఖరాలు అధిరోహించడం లాంటివి. ఒకవేళ సాధించగలిగితే చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. నాకు వయసు పెరుగుతున్నది. ఇంక ఎంతకాలం ఆడతానో తెలియదు. గతేడాది చివరి టెస్టు ఓడి యాషెస్ సిరీస్ను డ్రా చేసుకోవడం నిరాశకలిగించింది” అని స్మిత్ అన్నాడు. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్లో స్మిత్ 110.57 సగటుతో 774 పరుగులు చేసి అదరగొట్టాడు. చివరికి సిరీస్ 2-2తో డ్రా అయింది.