ఈ రోజు జరిగే మూడో వన్డే మ్యాచ్ లోనైనా ఆస్ట్రేలియా పై భారత్ నెగ్గుతుందా?
By: chandrasekar Wed, 02 Dec 2020 09:23 AM
ఆస్ట్రేలియాలో టూర్ లో
మొదటి రెండు వన్డే మ్యాచ్ లలో భారత్ చిత్తుగా ఓడిపోవడంతో ఇక మిగిలిన మూడో
మ్యాచ్ల్లోనైనా గెలుస్తుందా లేక పరువు పోగొట్టుకుంటుందా అని ఈ రోజు తేలిపోనుంది.
తొలి రెండు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడిపోయిన ఇండియా మూడో మ్యాచ్లోనైనా గెలిచి పరువు
కాపాడుకుంటుందా తెలియాలి. ఇప్పటికే సరీస్ చేజారినా కనీసం వైట్వాష్ నుంచైనా
తప్పించుకుంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా ఇంకా టెస్ట్ సిరీస్, టీ 20
మ్యాచ్లు కూడా ఆడాల్సి ఉంది. పరువు పోతుందా లేక నిలబెట్టుకుంటుందా అనేది ఈ రోజు
తేలిపోనుంది.
ఆస్ట్రేలియా పై కనీసం
ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోతే జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఈ ఎఫెక్ట్ మిగతా
మ్యాచ్లపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పటికైనా కోహ్లీ టీమ్ కాస్తంతా
తేరుకోవాలి. కంగారుల పని పట్టాలి. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి మంచి
ఊపుమీదున్న ఆస్ట్రేలియా ఏమాత్రం తగ్గకపోవచ్చు. అదే జోరు కొనసాగించడానికి కచ్చితంగా
ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం వార్నర్ గాయంతో ఈ మ్యాచ్కి దూరం కావడం ఇండియాకి
కలిసొచ్చే విషయం. ఇతడి స్థానంలో వేడ్ లేదా డార్సీ షార్ట్ వచ్చే అవకాశాలు
కనిపిస్తున్నాయి. అలాగే బౌలింగ్లో హేజిల్వుడ్, జంపాలను సమర్థవంతంగా
ఎదుర్కొని బారి స్కోర్ చేయాల్సివుంది.
మన టీంలో బౌలింగ్ మరియు
టాప్ ఆర్డర్ బాటింగ్ లోను ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వుంది. ఇక ఇండియా టీంకు వస్తే
గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఫాస్ట్ బౌలర్ సైని, లెగ్ స్పిన్నర్ చాహల్ను
పక్కన పెట్టాల్సిందే. అలాగే నటరాజన్ను టీంలోకి తీసుకురావాలని ఒత్తిడి
పెరుగుతోంది. ఇక బుమ్రా కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. షమి ఒక మ్యాచ్లో
ఆకట్టుకున్నా మరో దాంట్లో చేతులెత్తేశాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్
విషయంలో విమర్శలు ఎదర్కొంటున్న విరాట్ ఏం చేస్తాడో చూడాలి. కంగారుల ఎదుట భారీ
లక్ష్యాన్ని నిలపాలంటే కచ్చితంగా విరాట్ విజృంభించాలని క్రికెట్ అభిమానులు
కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియా ను అదుపు చేసి తక్కువ స్కోర్ కి కట్టడి చేస్తే మనం విజయం
సాధించవచ్చు.