తనకు డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నాయని నిరూపిస్తే ముంబై నుంచి శాశ్వతంగా వెళ్లిపోతా
By: chandrasekar Tue, 08 Sept 2020 9:03 PM
బాలీవుడ్ నటుడు సుశాంత్
సింగ్ ఆత్మహత్యపై ధైర్యంగా ఉన్న విషయాలు
మాట్లాడిన నటీమణి కంగనా రనౌత్. ఇండస్ట్రీలో బంధుప్రీతి, వారసత్వం
కారణంగానే సుశాంత్ లాంటి వాళ్లు సమస్యలు ఎదుర్కొన్నారని, కొందరు
ప్రాణాలు తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
తాజాగా కంగనా రనౌత్పై
డ్రగ్స్ తీసుకుంటుందన్న ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్లో డ్రగ్ మాఫియాపై
మాట్లాడినందుకు, ఆమెనే డ్రగ్స్ తీసుకుంటుందంటూ కొందరు ఆరోపణలు చేసారు.తనకు
డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నాయని నిరూపించగలిగితే తాను ముంబైని శాశ్వతంగా వదిలి
వెళ్తానని సవాల్ చేసింది.
ముంబై పోలీసులు, హోంశాఖ
మంత్రి అనిల్ దేశ్ముఖ్లను ఉద్దేశించి మాట్లాడుతూ నాకు డ్రగ్ పరీక్షలు
చేయండి. ఏదైనా డ్రగ్స్ డీలర్తో
సంబంధాలుగానీ, డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగానీ నిరూపిస్తే తప్పు
చేశానని ఒప్పుకుంటాను. ముంబైని శాశ్వతంగా వదిలి వెళ్లిపోతానని కంగనా రనౌత్
పేర్కొంది.