Advertisement

  • చట్టాలు వెనక్కి తీసుకోకపోతే రైల్వే ట్రాక్స్ బ్లాక్ చేస్తాం

చట్టాలు వెనక్కి తీసుకోకపోతే రైల్వే ట్రాక్స్ బ్లాక్ చేస్తాం

By: Sankar Thu, 10 Dec 2020 7:03 PM

చట్టాలు వెనక్కి తీసుకోకపోతే రైల్వే ట్రాక్స్ బ్లాక్ చేస్తాం


వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను బ్లాక్‌ చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు.

కేంద్రానికి గురువారం వరకు అల్టిమేటం ఇచ్చామని, ప్రధాని మోదీ తమ మాట వినకపోతే, చట్టాలను వెనక్కి తీసుకోక పోతే రైల్వే ట్రాక్‌లను బ్లాక్ చేస్తామని రైతు నాయకుడు బూటా సింగ్ తెలిపారు. కేవలం పంజాబ్‌లో మాత్రమేగాక రైతులంతా దేశవ్యాప్తంగా రైలు పట్టాల వద్ద నిరసన తెలుపుతారని అన్నారు.

గురువారం నాటి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై సన్యుక్ట్ కిసాన్ మంచ్ ఒక తేదీని నిర్ణయించి ప్రకటిస్తుందని తెలిపారు.కాగా కేంద్ర తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా ఢిల్లీలో రైతులు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే ..అందులో భాగంగా డిసెంబర్ 8 న దేశవ్యాప్తంగా బంద్ కూడా చేసారు

Tags :
|
|

Advertisement