ఏడేళ్ల చిన్నారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేస్తారా: చంద్రబాబు
By: chandrasekar Thu, 17 Sept 2020 12:13 PM
ఆంధ్రప్రదేశ్లో అధికార
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినట్లుగా వింటూ కొంత మంది పోలీసులు చట్టాలను
అతిక్రమిస్తు్న్నారని తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు
చంద్రబాబునాయుడు విమర్శించారు. కృష్ణా జిల్లా పోలీసులు ఏడేళ్ల చిన్నారిని స్టేషన్లో
నిర్బంధించారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో వైసీపీ చట్టాలు
అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ‘‘కొంత మంది పోలీసులు తాము అమలుచేయాల్సిన
చట్టాలను వదిలేసి వైసీపీ నేతల మాటే చట్టం అన్నట్టుగా వ్యవహరించడం ఘోరం.
వైసీపీ నేత ఫిర్యాదు
చేశాడని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులను 7 ఏళ్ళ
చిన్నారితో సహా తెచ్చి చిల్లకల్లు స్టేషన్లో నిర్బంధించారు. ఆ చిన్నారిలో మీకు ఏ నేరస్థుడు కనిపించాడు. స్త్రీ, పురుషులను
ఒకే గదిలో నిర్బంధించమని ఏ చట్టంలో ఉంది? తెలుగుదేశం పార్టీ వాళ్లను కరోనా నిబంధనలంటూ ఇబ్బంది
పెట్టే మీకు, ఇలా అందరినీ గుంపుగా ఒక్కచోట నిర్బంధించడానికి ఏ
వైసీపీ చట్టం అనుమతించింది? కోర్టులు వేలెత్తి చూపినా మీ తీరు మారదా?’’ అంటూ
చంద్రబాబు మండిపడ్డారు.