Advertisement

  • కళ్లెదుట మంటల్లో కాలిపోతున్న భర్తను భార్య ఏమి చేసిందో తెలుసా...!

కళ్లెదుట మంటల్లో కాలిపోతున్న భర్తను భార్య ఏమి చేసిందో తెలుసా...!

By: Anji Sat, 14 Nov 2020 1:22 PM

కళ్లెదుట మంటల్లో కాలిపోతున్న భర్తను భార్య 
ఏమి చేసిందో తెలుసా...!

కళ్లెదుట మంటల్లో కాలిపోతున్న భర్తను చూసి తట్టుకోలేకపోయిన భార్య కాపాడేందుకు యత్నించింది. మంటలు అంటుకుని ఆమె కూడా అగ్నికి ఆహుతైంది.

ఈ అత్యంత విషాద ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. కైకలూరు పరిధిలోని మండవల్లి మండలం పులపర్రుకి చెందిన అంచా చంద్రశేఖర్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.

అప్పుల తీర్చే మార్గం కనిపించిక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు.

కట్టుకున్న భర్త కళ్లెదుటే మంటల్లో కాలిపోతుండడం చూసిన భార్య అనూష తల్లడిల్లిపోయింది. తన భర్తను కాపాడుకునేందుకు మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెకు కూడా మంటలు వ్యాపించాయి.

ఒంటికి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు స్పందించి భార్యాభర్తలను కైకలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ చికిత్స పొందుతూ భార్యాభర్తలు మృతి చెందారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Advertisement