- హోమ్›
- వార్తలు›
- జాగ్రత్తలు తీసుకోకుండా అన్లాక్ చేపడితే ..తిప్పలు తప్పవు... ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్
జాగ్రత్తలు తీసుకోకుండా అన్లాక్ చేపడితే ..తిప్పలు తప్పవు... ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్
By: Sankar Tue, 01 Sept 2020 2:04 PM
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ లో అన్ని దేశాలు సడలింపులు ఇస్తున్నాయి..తాజాగా ఇండియాలో కూడా అన్లాక్ 4.0 మార్గదర్శకాలను ప్రకటించింది..ఇంకా మరి కొన్ని దేశాలు కూడా లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తున్నాయి.. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అద్నమ్ ఘేబ్రెయేసిస్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. కరోనా ముప్పు కొనసాగుతున్న వేళ.. తొందరపడి అన్లాక్ ప్రక్రియను చేపడితే.. ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
జాగ్రత్తలు తీసుకోకుండా అన్లాక్ చేపడితే ఇబ్బందులు తప్పవని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి అంతమైందని ఏ దేశమూ భావించొద్దన్నారు. కార్యక్రమాలను విచ్చలవిడిగా నిర్వహించొద్దని.. ప్రజలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ తమను తాము కాపాడుకోవాలని.. కరోనా కేసులను గుర్తించి చికిత్స అందించాలని, కరోనా బాధితుల కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్లో ఉంచాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ సూచించారు.
అన్లాక్ ప్రక్రియ చేపట్టే విషయంలో దేశాలు సీరియస్గా ఉంటే.. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, ప్రాణాలను కాపాడటంలోనూ అదే రీతిలో వ్యవహరించాలని టెడ్రోస్ సూచించారు. ప్రపంచ దేశాల సామాజిక, ఆర్థిక వ్యవస్థలు తిరిగి సాధారణ స్థితికి చేరే ప్రక్రియ సురక్షితంగా ఉండాలని ఓ సమావేశం సందర్భంగా టెడ్రోస్ వెల్లడించారు. కరోనా సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్నారు.