హిందీలో రీమేక్ అవనున్న బ్రోచేవారెవరురా....
By: chandrasekar Fri, 18 Dec 2020 6:00 PM
2019లో విడుదలై సూపర్హిట్గా నిలిచిన తెలుగు చిత్రం
బ్రోచేవారెవరురా. ఈ సినిమా కామెడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో శ్రీ విష్ణు, నివేద
థామస్, నివేథ పెతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, శివాజి రాజా, ప్రయదర్శిని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం
వివేక్ ఆత్రేయ వహించారు. బాలీవుడ్ దర్శక నిర్మాతలు తెలుగు సినిమాలని రీమేక్
చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డితో పాటు మరికొన్ని చిత్రాలని
రీమేక్ చేసి విడుదల చేసారు. ఇప్పుడు
జెర్సీ, మిథునం, ఛత్రపతి
వంటి సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు.
అజయ్ దేవగణ్కు
బ్రోచేవారెవరురా సినిమాలో క్రైమ్ కామెడీ నచ్చడంతో రీమేక్ చేసే ఆలోచన చేశారు.
హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలో కొన్ని మార్పులు చేసి చిత్రాన్ని
రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది. అభయ్ డియోల్, సన్నీ డియోల్ కుమారుడు
కరణ్ డియోల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారట.