Advertisement

డబ్ల్యూహెచ్ వో ఆసక్తికర వ్యాఖ్యలు

By: chandrasekar Fri, 28 Aug 2020 1:53 PM

డబ్ల్యూహెచ్ వో ఆసక్తికర వ్యాఖ్యలు


అంతర్జాతీయ ఒత్తిడితో కరోనా మూలాలపై విచారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించిన సంగతి తెలిసిందే. వుహాన్ నగరంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు అయ్యింది. ఇది వైరస్ నుంచి లీక్ అయ్యిందా..? లేదా సహజంగా పుట్టిన వైరసేనా అని విషయమై ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి. వైరస్ మూలాలపై విచారణలో భాగం కావడానికి చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. కరోనా వ్యాప్తి, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడానికి దారి తీసిన పరిస్థితులపై అంతర్జాతీయ బృందం అధ్యయనం చేస్తుందని డబ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్సీస్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకెల్ ర్యాన్ తెలిపారు.

ఈ అంతర్జాతీయ బృందంలో భాగం కావడానికి చాలా దేశాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయన్నారు. అంతర్జాతీయ బృందం వుహాన్ వెళ్తుంది. వైరస్ మూలాల విషయమై అధ్యయనం కోసం అక్కడి చైనా సహచరులతో కలిసి పని చేస్తుందని ర్యాన్ పేర్కొన్నారు. సహజంగా హెర్డ్ ఇమ్యూనిటీకి చేరుకోవడం అనేది ప్రమాదకరమని.. మరణాలు ఎక్కువ అవుతాయని డబ్ల్యూహెచ్‌వో కరోనా టెక్నికల్ లీడ్ అయిన మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. వ్యాక్సినేషన్ చాలా సురక్షితమైందన్నారు. జనాభాలో 65-70 శాతం మందికి టీకా వేయడం ద్వారా ఇమ్యూనిటీ కాపాడొచ్చని.. టీకాలే జనాభాలో ఎక్కువ మందికి రక్షణనిస్తాయన్నారు.

Tags :
|
|

Advertisement