Advertisement

  • కరోనా వ్యాక్సిన్ పై ఫోన్ లో సంబాషించిన మోడీ ,మరియు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌

కరోనా వ్యాక్సిన్ పై ఫోన్ లో సంబాషించిన మోడీ ,మరియు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌

By: Sankar Thu, 12 Nov 2020 3:58 PM

కరోనా వ్యాక్సిన్ పై ఫోన్ లో సంబాషించిన మోడీ ,మరియు డబ్ల్యూహెచ్‌ఓ  డైరెక్టర్‌ జనరల్‌


కరోనా వ్యాక్సిన్‌ ‘కోవ్యాక్స్‌’ తయారీలో భారత చిత్తశుద్ధిని కొనియాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గ్యాబ్రియేసస్‌ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రధాని చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కరోనా.. ప్రపంచం ఎదుర్కొంటున్న గొప్ప సమస్య, ఈ సమస్య పరిష్కారానికి కావాల్సిన వ్యాక్సిన్‌ తయారిలో భారత్‌కు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. నరేంద్ర మోదీ, గ్యాబ్రియేసస్‌ సంప్రదాయ ఔషదల విషయమై బుధవారం ఫోన్‌లో సంభాషించారు.

ప్రపంచానికి సంప్రదాయ ఔషదాల అవసరం ఎంతో ఉందని, వాటిపై మరింత పరిజ్ఞానం, పరిశోధనలు అవసరమని అందుకోసం పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు..ఇక కరోనా సమయంలో ప్రపంచం మొత్తాన్ని ఒక్కటి చేసి, మహమ్మారిని ఎదుర్కొనేందుకు డబ్ల్యూహెచ్‌ఓ చేసిన చర్యలను మోదీ కొనియాడారు.

Tags :
|
|

Advertisement