Advertisement

  • కారులో ఉండగానే పెట్రోల్ పోసి ముగ్గురిని సజీవదహనం చేశారు ... విజయవాడలో ఘోరం

కారులో ఉండగానే పెట్రోల్ పోసి ముగ్గురిని సజీవదహనం చేశారు ... విజయవాడలో ఘోరం

By: chandrasekar Mon, 17 Aug 2020 10:24 PM

కారులో  ఉండగానే పెట్రోల్ పోసి ముగ్గురిని  సజీవదహనం చేశారు ... విజయవాడలో ఘోరం


విజయవాడలోదారుణం చోటు చేసుకుంది. దుండగులు కారులో పెట్రోల్ పోసి ముగ్గురిని తగలబెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అయ్యారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కారును దుండగులు దహనం చేశారు.

ముగ్గురు వ్యక్తులు కారులో ఉండగానే దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. కారులోని ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గరిలో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ఈ దారుణానికి రియల్ ఎస్టేట్ వివాదాలే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement