Advertisement

  • దేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో సేవల్ని విస్తరించేందుకు "వాట్సప్" భారీ ప్రణాళికలు

దేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో సేవల్ని విస్తరించేందుకు "వాట్సప్" భారీ ప్రణాళికలు

By: chandrasekar Fri, 24 July 2020 4:45 PM

దేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో సేవల్ని విస్తరించేందుకు "వాట్సప్" భారీ ప్రణాళికలు


వాట్సప్ యూజర్లకు త్వరలో మరిన్నిసేవల్నిఅందుబాటులోకి తీసుకురానుంది వాట్సప్. ఇప్పటికే భారతదేశంలో వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ పైలట్ పద్ధతిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొందరు యూజర్లకు ఇప్పటికే వాట్సప్ పేమెంట్ సర్వీస్ లభిస్తోంది. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది యూజర్లు వాట్సప్ పేమెంట్ సేవల్ని పొందుతున్నారు.

వాట్సప్ పేమెంట్ యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులతో కలిసి ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది వాట్సప్. త్వరలో వాట్సప్ లెండింగ్, మైక్రో పెన్షన్, ఇన్సూరెన్స్ సేవల్ని ప్రారంభించనుంది. అంటే మీరు వాట్సప్ నుంచే లోన్స్ తీసుకోవచ్చు. ఈ విషయాన్ని వాట్సప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2020 ఈవెంట్‌లో వెల్లడించారు.

భారతదేశంలో పేమెంట్స్ సేవల్ని ప్రారంభించేందుకు వాట్సప్ రెండున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 2018 ఫిబ్రవరి నుంచి ప్రయత్నిస్తున్నాఇప్పటికీ బీటా స్టేజ్‌లోనే వాట్సప్ పేమెంట్ నడుస్తోంది. పూర్తి స్థాయిలో వాట్సప్ పేమెంట్ సేవలు ప్రారంభం కాలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత వాట్సప్ పేమెంట్ సేవలు యూజర్లందరికీ లభించనున్నాయి.

వాట్సప్ పేమెంట్ ద్వారా యూపీఐ సేవల్ని అందించడం మాత్రమే కాకుండా లెండింగ్, మైక్రో పెన్షన్, ఇన్సూరెన్స్ సేవలపైనా దృష్టిపెట్టింది. అయితే వాట్సప్ మాత్రం భారతదేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో అడుగు పెట్టి సేవల్ని విస్తరించేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Tags :

Advertisement