ఒక్క ఛాన్స్ ఇవ్వండి స్వర్ణ బెంగాల్ చేసి చూయిస్తాము ....రోడ్ షో లో అమిత్ షా
By: Sankar Sun, 20 Dec 2020 5:37 PM
ఇప్పటికే తెలంగాణాలో అధికారం కోసం వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ , అంతేవేగంగా వెస్ట్ బెంగాల్ లో కూడా అధికారం దక్కించుకోవడానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తుంది ..గత రెండు పర్యాయాలు అధికారం దక్కించుకొని సీఎం పదవి దక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ని ఈ సారి ఎలాగయినా గద్దె దించాలని బీజేపీ భావిస్తుంది.. అందులో భాగంగానే రాష్ట్రంలో అమిత్ షా పర్యటన కొనసాగుతోంది....
అమిత్ షా ఆదివారం బోల్పూర్లో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి తృణమూల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ‘ఈ రోడ్ షో మమతా దీదీ పట్ల బెంగాల్ ప్రజలు కోపాన్ని చూపిస్తోంది. ఇలాంటి రోడ్ షో నా జీవితంలో చూడలేదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల బెంగాల్ ప్రజల నమ్మకం, ప్రేమ ఈ రోడ్ షో చూపిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ పాలన చూశారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అయిదేళ్లలో స్వర్ణ బెంగాల్ సాధిస్తాం’ అని అమిత్ షా అన్నారు