సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యతనిస్తుంది: కేటీఆర్
By: chandrasekar Wed, 08 July 2020 11:59 AM
జిల్లాలోని వీర్నపల్లిలో
రూ.15 కోట్ల
రూపాయలతో బ్రిడ్జీల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించి
మాట్లాడారు. 500 మంది జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన
ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఐటీ, పుపాలక శఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పాలనా సౌలభ్యం
కోసం సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే
సుపరిపాలన అందిస్తురన్నారు. రైతులకు ఇంత కష్ట కాలంలో 57 లక్షల
మంది కి రైతుబంధు ఇచ్చామని పేర్కొన్నారు.
మనం అడవిని కాపాడుకోవాలి. అది మన అందరి బాధ్యత. అడవిని ధ్వంసం చేస్తే కటిన చర్యలు
తీసుకుంటామని హెచ్చరించారు.
అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత
మనపై ఉందన్నారు. కొత్తగా వీర్నపల్లి మండలం ఏర్పాటు కావడంతో గ్రామాల ప్రజలు సుదూర
ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి తప్పింది. ఆర్థిక, దూర భారం తగ్గిందన్నారు. వీర్నపల్లిలో ఇంకా పెద్ద
ఎత్తున అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. పేదవారి ముఖంలో ఆనందం చూడాలన్నదే కేసీఆర్
లక్ష్యమన్నారు. మొక్కలు నాటడం కాదు, వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని మంత్రి
సూచించారు.
ఎంతో కసరత్తు చేసి
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రంగంపేట అటవీ భూ సమస్యలకు పరిష్కారం చూపాం. పోడు
భూములను ఏండ్లుగా సాగు చేసుకుంటున్న 307 మంది ఎస్టీలు, ఇతర పేదలకు 281 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కల్పించామని
వెల్లడించారు. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును
రాజుగా చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. రైతుల కోఎసం ఎన్నో సంక్షేమ పథకాలు
అమలు చేస్తున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు శాస్త్రీయ దృక్పథంతో
నియంత్రిత పంటల సాగుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు.
రోడ్లు బాగుంటేనే ఆర్థిక
వ్యవస్థ బాగుపడుతుంది. మారుమూల గ్రామాలు కూడా ఆర్థికాభివృద్ధికి నోచుకొంటాయి.
గ్రామీణ రహదారులు, వంతెనల విషయంలో గత ఆరెండ్లలో గణనీయమైన పురోగతి సాధించామని
పేర్కొన్నారు. రాజకీయ లాభాపేక్ష లేకుండా
భవిష్యత్తు తరాలు బాగుపడాలనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం
చుట్టారన్నారు. ఇష్టారీతిగా చెట్లను నరికితే గాలిని కూడా కొనే పరిస్థితి ఉంటుంది.
అలాంటి పరిస్థితి రావొద్దని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారానికి పూనుకున్నదని
పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యతనిస్తుందని
మంత్రి తెలిపారు.