'మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం సార్...మహేష్ బాబు.
By: chandrasekar Sat, 22 Aug 2020 01:00 AM
సినీ, రాజకీయ ప్రముఖులు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నిత్యం ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తాజాగా టాలీవుడ్ సుపర్స్టార్ మహేష్ బాబు కూడా ఓ ట్వీట్ చేశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సినీ, రాజకీయ ప్రముఖులు నిత్యం ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తాజాగా టాలీవుడ్ సుపర్స్టార్ మహేష్ బాబు కూడా ఓ ట్వీట్ చేశారు.
'మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం సార్..
ఈ పరిస్థితులలో మీ కుటుంబానికి తగిన స్థైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామని మహేష్ బాబు తన ట్వీట్లో తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఆగస్టు 5న జరిపిన కరోనా పాజిటివ్ అని తెలియడంతో అప్పటి నుంచే చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. బాలు ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఆయనకు ఐసియులో వెంటిలేటర్పై ఉంచి 'ఎక్మో' సాయంతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ గాన గంధర్వుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్వీట్ చేశారు.