మా దగ్గర పనిచేస్తున్న 20 మందికి ప్రతి నెలా జీతాలిచ్చేస్తున్నాం: రష్మిక
By: chandrasekar Tue, 21 July 2020 4:56 PM
తనకు, తన
తండ్రికి కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆదాయం లేదని, అయినా తమ వద్ద పనిచేస్తున్న వారికి జీతాలిస్తున్నామని
హీరోయిన్ రష్మిక మందన్న వెల్లడించింది.
తమకు పనిలేకపోయినప్పటికీ, తన
స్టాఫ్కు ప్రతినెల సమయానికి జీతాలు చెల్లిస్తున్నామని తెలిపింది. ఎప్పుడూ బిజీగా
ఉండే తను లాక్డౌన్ కారణంగా ఖాళీగా సమయం గడపలేకపోతున్నానని చెప్పింది.
`ఈ ఏడాది నాకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. రెండు
సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. కానీ అనుకోకుండా కరోనా మహమ్మారి వచ్చిపడింది.
జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది.
నాకు ఆదాయం లేదు. మా
నాన్న బిజినెస్ కూడా పూర్తిగా నిలిచిపోయింది. అయినా మా దగ్గర పనిచేస్తున్న 20
మందికి ప్రతి నెలా జీతాలిచ్చేస్తున్నాం. పని లేదని చెప్పి వారిని వదిలించుకోవడం
మాకు ఇష్టం లేదు’ అని చెప్పుకొచ్చింది రష్మిక.
ప్రస్తుతం కొత్త
స్క్రిప్టులు వింటున్నానని, కరోనా ప్రభావం తగ్గితే తిరిగి షూటింగ్లు
ప్రారంభమవుతాయని చెప్పింది రష్మిక మందన్న.