Advertisement

  • దేశంలో మొత్తం 75,60,782 పరీక్షలు నిర్వహించాం: ఐసీఎంఆర్

దేశంలో మొత్తం 75,60,782 పరీక్షలు నిర్వహించాం: ఐసీఎంఆర్

By: chandrasekar Fri, 26 June 2020 1:06 PM

దేశంలో మొత్తం 75,60,782 పరీక్షలు నిర్వహించాం: ఐసీఎంఆర్


దేశంలో కరోనా కలకలం కొనసాగుతున్నది. గతవారం రోజులుగా 14 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, ఈ రోజు రికార్డు స్థాయిలో 17వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఒకేరోజు 418 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,73,105కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1,86,514 యాక్టివ్‌ కేసులు ఉండగా, 2,71,697 మంది బాధితులు కోలుకున్నారు.

ఈ మహమ్మారి బారినపడినవారిలో ఇప్పటివరకు 14,894 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాలు గా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు వున్నాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మే 23న దేశంలో 1,25,101 కరోనా కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య జూన్‌ 25 నాటికి 4,73,105కు పెరిగింది. అంటే దీనిప్రకారం నెల రోజుల్లోనే దేశంలో సుమారు మూడు లక్షల యాభైవేల కేసులు నమోదయ్యాయి. జూన్‌ 1న లాక్‌డౌన్‌ను సడలించడంతో కరోనా కేసులు సంఖ్య దేశంలో మరింతగా పెరిగింది.

దేశంలో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి నిన్నటి వరకు మొత్తం 75,60,782 పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,07,871 మందికి పరీక్షలు చేశామని, అందులో 16922 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారని తెలిపింది.

Tags :

Advertisement