Advertisement

  • ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాము ..చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో

ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాము ..చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో

By: Sankar Thu, 03 Sept 2020 9:36 PM

ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాము ..చెన్నై సూపర్ కింగ్స్  సీఈవో


సెప్టెంబ‌ర్ 19 నుంచి మొద‌లుకానున్న ఐపీఎల్ 13వ సీజ‌న్ ఆరంభానికి ముందే చెన్నై సూప‌ర్‌ కింగ్స్ జ‌ట్టులో క‌రోనా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. జ‌ట్టులో 13 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే మొద‌టిద‌ఫా నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో అంద‌రికి నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు మంగ‌ళ‌వారం వ‌చ్చిన రిపోర్టులో తేలింది. తాజాగా గురువారం ఈ 13 మందికి రెండోసారి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

దీనికి సంబంధించిన ఫ‌లితాలు శుక్ర‌వారం ఉద‌యం రానున్నాయి. మ‌రోవైపు రేప‌టినుంచే చెన్నై సూప‌ర్‌కింగ్స్ ప్రాక్టీస్ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు జట్టు యాజ‌మాన్యం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఫ‌లితాలు శుక్ర‌వారం ఉద‌యం వెలువ‌డుతుండ‌డంతో.. ఎలాగూ ఆట‌గాళ్లంద‌రికి నెగెటివ్ వ‌స్తుంది.. సాయంత్రం కల్లా చెన్నై జ‌ట్టు త‌మ ప్రాక్టీస్ మొద‌లుపెడుతుంద‌ని యాజ‌మాన్యం స్ప‌ష్టం చేసింది..

ఇప్ప‌టికే చెన్నై మిన‌హా అన్ని జ‌ట్లు త‌మ ప్రాక్టీస్‌ను మొద‌లుపెట్టేశాయి. అంత‌కుముందు.. సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ మాట్లాడుతూ.. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు ముంబైతో త‌ల‌ప‌డేందుకు సిద్ధంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఇదే విషయమై బీసీ‌సీఐ కూడా స్పందించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ క‌చ్చితంగా చెన్నె సూప‌ర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ల మ‌ధ్యే జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నట్టు తెలిపింది. ఈ విష‌యంపై శ‌నివారం ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు బీసీసీఐ పేర్కొంది.

Tags :
|
|

Advertisement